16, అక్టోబర్ 2017, సోమవారం

Farmer's set రైతు సమితి

Farmer's set రైతు సమితి
నోముల ప్రభాకర్ గౌడ్
రైతు సమితిలతో హక్కుల రక్షణ
రైతులు అసంఘటితంగా ఉండటం వల్ల వారు తమ హక్కుల గురించి,సమస్యల గురించి ఒక తాటిపైకి వచ్చి ప్రయత్నించిన దాఖలాలు లేవు. ఫలితంగా కొందరు రైతులు వ్యవసాయాన్ని వదిలి పట్టణాలకు వలస వెళ్లారు. మిగిలిన వారు వ్యవసాయంతో నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు. కానీ సంఘటిత రంగంలోని సభ్యునికి ఉపాధి దొరకనప్పుడు నిరుద్యోగభృతి లభిస్తుంది. అంతేకాదు సంఘంలో వారి గౌరవ మర్యాదలకు ఎటువంటి భంగం వాటిల్లదు. అందుకే వారు మెరుగైన జీవన ప్రమాణాలతో జీవిస్తారు. కానీ ఇవేవీ అసంఘటిత రంగంలో ఉన్న రైతులకు ఉండవు. దీన్నిబట్టి మన వ్యవసాయరంగం ఎంతటి దయనీయ స్థితిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. దేశానికి వెన్నెముక అయిన రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. రైతుల ను రాష్ర్టాభివృద్ధిలో భాగస్వామ్యం చేసేందుకు వారందరిని చట్టబద్ధంగా సంఘటితపరిచే చర్యలు ప్రారంభించడం ఆహ్వానించదగిన పరిణామం.
రాష్ట్రంలో దాదాపు 55లక్షలకు పైగా రైతు కుటుంబాలున్నాయి. ఇం దులో సుమారు 48లక్షలు చిన్న, సన్నకారు కుటుంబాలే. అలాగే రాష్ట్రం లో సగటు భూ కమత పరిమాణం 1.2 హెక్టార్లు. ఇది భారతీయ భూకమత పరిమాణం 1.16 హెక్టార్ల కంటే తక్కువ. రాష్ట్రంలో ఉన్న రైతాంగం ఆర్థిక సంక్షోభంలో ఉండటానికి అనేక కారణాలున్నాయి. పంట రకం, దాన్ని పండించే తీరును ప్రాథమికంగా పేర్కొనవచ్చు. ఎక్కువమంది రైతు లు వానాకాలం, యాసంగిల్లో పునరావృతంగా ఒకేపంటను సాగు చేస్తున్నారు. రైతులకు వారు పండిస్తున్న పంటల శాతం రాష్ట్రంలో, దేశంలో, అలాగే అంతర్జాతీయంగాను ఎంత మొత్తంలో ఉంటున్నది అన్న అవగా హన ఉండటం లేదు. ఆ పంటల మొత్తం దిగుబడి, వినియోగ అవసరం ఎంత ఉన్నది? అలాగే పంటలను ఎటువంటి సాగు పద్ధతుల ద్వారా సాగుచేస్తున్నారన్న విషయాలపై ప్రాథమిక అవగాహన ఉండదు. కాలానుగుణంగా వస్తున్న మార్పులపై, ఇక్కడున్న భూకమత పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకోకుండా సాంప్రదాయకంగా, మార్కెట్ ధరలు చూసి అవే పంటలు పునరావృతంగా సాగుచేస్తున్నారు. దీనివల్ల సగటు దిగుబ డి పెరుగుతున్నప్పటికీ భూమి సారం కోల్పోతున్నది. దీంతో చీడపీడలను తట్టుకోవడానికి అధిక మొత్తంలో రసాయన ఎరువులను వాడుతున్నారు. దీనివల్ల సాగు వ్యయం గణనీయంగా పెరుగుతున్నది. దీనికితోడు వచ్చిన దిగుబడికి అనేక సందర్భాల్లో గిట్టుబాటు ధర లభించడం లేదు. ఇలా ఏటా అప్పుల ఊబిలోకి నెట్టివేయబడిన రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బతుకుదెరువు కోసం పట్టణాలకు వలస వెళ్తున్నారు.
ఈ పరిస్థితిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవడానికి వేలకోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసింది. అలాగే వ్యవసాయ రంగానికి సాగు నీరు అందించడానికి భారీ సాగునీటి ప్రాజెక్టులను నిర్మిస్తున్నది. చెరువులను పునరుద్ధరిస్తున్నది. వ్యవసాయంతో పాటు వాటి అనుబంధ రంగాల అభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్నది. దీనివల్ల సగ టు ఉత్పత్తి పెరుగుతుంది. దీనికి అనుగుణంగా తగిన ఫలాలు పొందాలంటే రైతులంతా సంఘటితం కావాలి. కాలానికి, అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. రైతులు సంఘటితంగా ఉండటం వల్ల ఏకాలంలో ఎటువంటి పంటలు పండించాలి? ఏ పద్ధతుల ద్వారా పం డించాలి? పండించే పంటకు కనీస మద్దతు ధర ఉన్నదా? అనే సమాచారాన్ని రైతులంతా సమిష్టిగా పంచుకోగల్గుతారు. భవిష్యత్తులో వివిధ పంటల దిగుబడి అంచనా వివరాలకు సంబంధించిన సమాచారం అందుబాటులోకి వస్తుంది. కాబట్టి రైతులంతా సమిష్టిగా ఉంటే సరైన నిర్ణయా లు తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. తద్వారా వ్యవసాయ రంగంలో నష్టాలను తగ్గించుకునే వీలు ఉంటుంది. ఉదాహరణకు కొంతమంది రైతులు నేల రకం, శీతోష్ణస్థితి, నీటి లభ్యత తదితర అంశాలపై అవగాహన లేకుండా మార్కెట్ ధరల ప్రాతిపదికన పంటలను సాగు చేస్తున్నారు. దీనివల్ల నష్టాలకు గురవుతున్నారు. కాబట్టి ఇకముందు ఇలా జరుగకుండా ఉండాలంటే రైతులంతా సంఘటితంగా ఉండాలి. రైతు సమన్వయ సమితిల ద్వారా ఈ ప్రయత్నం జరుగుతున్నది. ఇది సంపూర్ణంగా జరిగితే రాష్ట్ర వ్యవసాయరంగం సంక్షోభాన్ని అధిగమిస్తుంది.
సగటు కమత పరిమాణం, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా సాధ్యపడని అనేక వనరులను రైతులంతా సమిష్టిగా ఉండటం వల్ల సాధించవచ్చు. కొత్తగా వచ్చిన పద్ధతులు, ఆధునిక వ్యవసాయ యంత్రాలు అందుబాటులోకి వస్తాయి. దీనివల్ల సగటు వ్యవసాయ వ్యయం తగ్గడమే కాకుండా సగటు ఉత్పత్తి కూడా గణనీయంగా పెరుగుతుంది. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ రుణ సంస్థల నుంచి తక్కువ వడ్డీకే రుణాలు లభించే అవకాశం ఉన్నది. ఏదైనా కారణం చేత ఒక రైతు ఆర్థికంగా నష్టపోయినా సంఘటితంగా ఉండటం వల్ల అందరూ కలిసి తమ శక్తి మేరకు ఎంతో కొంత సహాయం చేస్తారు. దీంతో ఆ రైతును ఆర్థికనష్టాల నుంచి బైట పడవేయవచ్చు. అలాగే కాలానికి అనుగుణంగా పంటలను పండిస్తారు. కలిసి మార్కెట్ చేసుకోవడం వల్ల దళారీల జోక్యం తొలిగి సరైన ధరలు పొందవచ్చు. వివి ధ కారణాల చేత పంటను నిల్వ చేయాల్సి వచ్చినప్పుడు ప్రభుత్వం నిర్మించిన గిడ్డంగుల్లో సమిష్టిగా నిల్వ చేస్తారు. దీంతో నిల్వ, రవాణా ఖర్చులు తగ్గుతాయి. ఇలా అనేక ప్రయోజనాలను రైతులు సంఘటితం గా ఉండటం వల్ల పొందవచ్చు. కాబట్టి రైతులంతా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు సమన్వయ సమితిల్లో స్వచ్ఛందంగా చేరాలి. సమిష్టిగా ఉండి తమ హక్కులను సాధించుకోవాలి. సమస్యలను పరిష్కరించుకోవాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి