16, అక్టోబర్ 2017, సోమవారం

The mystery of creation సృష్టి రహస్యం

The mystery of creation సృష్టి రహస్యం

శతాబ్దాలకాలంగా బ్రాహ్మణ, బ్రాహ్మణేతరులు కలిమిడిగా, అభివృద్ధి చేసిన సామాజిక, రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. ఒకరిని మరొకరు దూషించుకునే స్థితికి చేరుకుందిప్పుడు. ఈ మార్పులవల్ల వర్ణాశ్రమ ధర్మాలకు బదులుగా కులాలప్రాధాన్యం వచ్చింది. రాజకీయ, సామాజిక, మతపర, సాంస్కృతిక వ్యవహారాల్లో కులాల ప్రస్తావన లేకుండా ఏదీ జరుగలేని స్థితికి చేరుకున్నాం. బ్రాహ్మణ వ్యతిరేకత చివరకు కులాల వ్యతిరేకతకు దారితీసింది. ఒక కులం వారు, మరో కులాన్నిదూషించే పరిస్థితులొచ్చాయి. అగ్ర కులాలని, వెనుకబడిన కులాలని, దళితులని భేదాలొచ్చాయి.

ఏది ఆర్య ధర్మమో, ఏది ఆర్ష ధర్మమో, ఏది కాదో నిర్ణయించే అర్హత ఎంతవరకుందో హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడేవారు ఆలోచించుకోవడం మంచిదేమో! ఉదా హరణకు సృష్టి రహస్యం పరిపూర్ణంగా సమగ్రంగా విప్పగలవారెవరైనా ఉన్నారా? పోనీ తమకు తెలుసని ఇంతవరకు ఎవరైనా అనగలిగారా? సైన్స్ ఎంతగానో అభివృద్ధి చెం దింది కదా? అయినప్పటికీ రోబోలను తయారుచేయగలిగారే కానీ మానవ శరీర నిర్మాణానికి అసలుసిసలు నమూనా ఎవరైనా చేయగలిగారా? టెస్ట్‌ట్యూబ్ బేబిని పుట్టిం చగలిగారు కాని, వీర్యం, అండం కలయిక లేకుండా దాన్ని సాధించగలిగారా? సృష్టి ఆది నుంచీ కొన్ని నియమాలు, నిబంధనలు, పద్ధతులు, ఆచరణలు, మంచీ-చెడు లు.. ఇలా ఎన్నో సంప్రదాయాలు చోటుచేసుకుంటూ వస్తున్నాయి. వాటిలోంచి ఈకకు ఈక, తోక కు తోకా లాగి, పాండిత్య ప్రదర్శన చేసి, సనాతన పద్ధతులను, సంస్కృతీ సంప్రదాయా లను, ఈసడించడం సమంజసం కాదేమో ఆలోచించుకోవడం మంచిది.అనాదిగా సంస్కృతీ సంప్రదాయాలకు నిలయమైన భారతావనిలో ఎవరెవరు ఎటు వంటి ధర్మాలను ఆచరించారనేదే ప్రధానం. వాటిని భావితరాలవారు ఎలా అర్థం చేసు కోవాలనేది ముఖ్యం. మన ఇతిహాసాలు, పురాణాలు, కావ్యాలు, హిందూ ధర్మశాస్ర్తాలు చెప్పిందంతా బూటకమని వాదించేకన్నా అందులోని ధర్మాలను, అధర్మాలను అవగా హన చేసుకోవడమూ ముఖ్యం. మన ప్రాచీన గ్రంథాల్లో ఎప్పుడూ-ఎక్కడా ఫలానా కులం వారే అధికులని చెప్పబడలేదు.
ఎన్నో పాత్రల ద్వారా, సంభాషణల ద్వారా ఎన్నో ధర్మాలను వివరించడం జరిగింది.
ఇటీవలి కాలంలో ఆ రచయితకు ఐనదానికీ, కానిదానికీ బ్రాహ్మ ణులను ఆడిపోసు కోవడం పరిపాటైంది. ప్రతి వ్యవహారాన్ని బ్రాహ్మణ్యంతో, బ్రాహ్మణ కులంతో ముడిపెట్టి విమర్శలు చేయడం తగనిపని. బ్రాహ్మణాధిక్యత అనే పదాలను కూడా తరచూ వాడటం మంచిది కాదు. ఆయన వాదనకు పనికొచ్చే బ్రాహ్మణ శాస్ర్తాలు, బ్రాహ్మణ్యం మిగిలిన విషయాలకు ఎందుకు పనికి రాదో అర్థంకాదు. బ్రాహ్మణులను ఆధ్యాత్మిక ఫాసిస్టులని దుర్మార్గపు రాతలు రాయ డం సరికాదు. బ్రాహ్మణ ఔన్నత్యాన్నీ, బ్రాహ్మణ మూల విశేషాలను, ఏమా త్రం తెలియని ఇతడు తన నోటికొచ్చినట్టు మాట్లాడ టం సమంజసం కాదు. చాతుర్వర్ణ వ్యవస్థ ప్రకారం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే నాలుగు వర్ణా లు వాడుకలో ఉన్నాయి. సమాజం అభివృద్ధి చెంది న నేడు కూడా, సామాజిక అవసరాల దృష్ట్యా, నాలుగు కాదు-నలభై తరగతులుగా మనమంద రం మన మన విధుల ను నిర్వహించడం లేదా? ఇలాంటి వ్యవస్థ ప్రాచీన కాలం నాటి ఈజిప్ట్, బాబి లోనియాలతో సహా, చైనా దేశంలోనూ ఉండేదట. అక్కడి వాడుక ప్రకారం వారిని పూజారులుగా, పాలకులుగా, వృత్తిదారులుగా, బానిసలుగా విభజిం చారు. అలానే ప్రాచీన ఇరా న్‌లో పిస్త్రీ అనే నాలుగు వర్ణాలుండేవి.
ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య వ్యవస్థ అమల్లో ఉన్న వర్తమానకాలంలో కూడా మనిషికి-మనిషికి మధ్య వ్యత్యాసాలు కొన్ని విషయాల్లో లేవా? ప్రభు త్వ ప్రైవేట్ సర్వీసుల్లో ఒకటవ తరగతి, రెండవ తరగతి, మూడు, నాలుగు తరగతుల ఉద్యోగులని విభజన లేదా? ఐఏఎస్, ఐపీఎస్ అధికారికీ, అటెం డర్‌కూ రాజ్యాంగపరంగా ఒకేరకమైన హక్కులిచ్చిన ప్పటికీ, వారిద్దరికీ మధ్య వ్యత్యాసాలు లేవా? ఇం జినీరునూ, డాక్టరునూ, గుమాస్తాను, దినసరి కూలీ ని, ఒకేరకంగా అన్ని విషయాల్లోనూ చూస్తు న్నా మా? దీనికి కారణం, ఇప్పటి మూలాలు ఆర్థిక మైన వైతే, నాటి కాలంలో మూలాలు మరోరకంగా ఉన్నా యి. దేశ కాలమాన పరిస్థితులకనుగుణంగా మార్పు లు చోటుచేసుకుంటున్నాయి. ఆ మార్పులో మంచి ఉంది, చెడు ఉంది. కమ్యూనిజం వచ్చిన చైనా, రష్యా దేశాల్లో కూడా ఈ తేడాలున్నాయి.
ఇక కులమంటే ఏమిటో చూద్దాం. ఒక అర్థం ప్రకారం కులమంటే నివాసం. వర్ణాలు వేరు, జాతు లు వేరు. వర్ణం అనే మాట వర్గాన్ని సూచిస్తే, జాతి అనేది కులాన్ని సూచిస్తుంది. ఇంగ్లీష్‌లో చెప్పుకోవా లంటే క్లాస్, కాస్ట్ అన్నమాట. జాతులు పెరుగుతూ తరుగుతూ వస్తున్నప్పటికీ, వర్ణాలు మాత్రం నాలు గు గానే ఉండిపోయాయి. ఏదేమైనప్పటికీ, చాతు ర్వర్ణ వ్యవస్థను ఎవరు-ఎప్పుడు సృష్టించినప్పటికీ, అదెలా రూపాంతరం చెందినప్పటికీ, అదొక సామా జిక అవసరాన్ని, బాధ్యతను ఆ కాలం నాటి అవస రాలకు అనుగుణంగా నిర్వహించింది. అందువల్ల ఎవరు కూడా తాము ఫలానా కులంలో పుట్టామని బాధపడాల్సిన అవసరంలేదు. గర్వపడాల్సిన అవ సరమూ లేదు. ఒక కులంలో పుట్టినందుకు వేరే కులం వారిని తక్కువగా కాని, ఎక్కువగా కాని చూడాల్సిన అవసరమూ లేదు.
బ్రాహ్మణుల విషయానికొస్తే, సమాజం వారికి అప్పగించిన బాధ్యతను వారు సక్రమంగా శక్తివం చన లేకుండా నిర్వహించారు. వారు కుల వ్యవస్థను ఏనాడూ పెంచి పోషించలేదు. సమాజం అవసరాల నేపథ్యంలో అదే సమాజం సృష్టించుకున్నవే ఇవన్నీ. అదే సామాజిక అవసరం నేపథ్యంలో బ్రాహ్మణులు పాలన, మంత్రాంగం, పురోహితాల వైపు దృష్టి మర ల్చారు. ప్రతి గ్రామంలోనూ ఆ గ్రామ పరిపాలన, సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణ కోసం పనిచేసే పంచ ప్రధానులలో కనీసం ఒకరిద్దరు బ్రాహ్మణు లుండేవారు. అదే నేటి గ్రామ పంచాయతీ వ్యవస్థ అయింది. సమాజాన్ని మార్క్సిస్టు కోణంలో నిశితం గా పరిశీలన చేసిన చరిత్రకారుడు కోశాంబి తన గ్రం థంలో, బ్రాహ్మణులు సమాజానికి చేసిన సేవకు గుర్తింపుగా గొప్ప యోగ్యతా పత్రం ఇచ్చారు. ఆర్య, ఆదిమవాసుల పునః కలయిక వల్ల ఏర్పడిన కులం గా బ్రాహ్మణులను అభివర్ణించి, ప్రాచీన పవిత్ర గ్రం థాల్లో లభ్యమైన వాటిని భద్రపరిచింది వారేనని, దాని విలువ అపారమని పేర్కొన్నారు. ఇలాంటి నేప థ్యంలో తమ బతుకేదో తాము బతుకుతున్న బ్రాహ్మణులను చీటికి-మాటికీ వేలెత్తి చూపుతూ, వారేదో తప్పుచేశారని చరిత్ర వక్రీకరించి మాట్లాడ టం సబబేనా?.
ఒకనాడు సమాజాన్ని ఐక్యంగా ఉంచడానికి తమ శాయశక్తులా కృషిచేసిన బ్రాహ్మణుల స్థితిగతు లు రోజురోజుకూ క్షీణించిపోతున్నాయి. బ్రాహ్మణ వ్యతిరేకత, బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో బలపడి, స్వతంత్ర భారతదేశంలో పతాక దశకు చేరుకుంది. మండల కమిషన్ నివేదికతో ఆ వ్యతిరేకత వేళ్లూను కుపోయింది. బ్రిటీష్ పాలనలో బ్రాహ్మణులను ఇబ్బందులకు గురిచేయడం యాధృచ్ఛికంగా జరి గిందేమీ కాదు. సామాజిక వ్యవస్థలో బ్రాహ్మణుల పాత్ర ఎంత ప్రాముఖ్యమైందో బ్రిటిష్‌వారికి మొద ట్లోనే అవగతమైంది. పవిత్రమైన సాంస్కృతిక-సం ప్రదాయక భవబంధాల నేపథ్యంలో దేశప్రజలను ఐక్యంగా-సమైక్యంగా మలుచడంలో కీలకపాత్ర పోషిస్తున్న బ్రాహ్మణులను కట్టడిచేయాలన్న ఆలోచ న ఆంగ్లేయులకు కలుగడం సహజం. విభజించి పాలించు అనే సంస్కృతిని అనుసరించే బ్రిటిష్ ప్రభుత్వం, భారత సమాజాన్ని విడదీయాలంటే, మొదలు బ్రాహ్మణులను దెబ్బతీయాలని భావించిం ది. చదువుకున్న బ్రాహ్మణుల మూలా న, భారతదే శంలో తమ గుత్తాధిపత్యానికి ప్రమాదం ఉందని భావించింది బ్రిటిష్ ప్రభుత్వం. జాతీయో ద్యమం లో పెద్దఎత్తున బ్రాహ్మణులు పాల్గొనడమే కాకుం డా నాయకత్వం వహించడం వారి అనుమా నాన్ని మరింత దృఢపరిచింది.
వాస్తవానికి శతాబ్దాలకాలంగా బ్రాహ్మణ, బ్రాహ్మణేతరులు కలిమిడిగా, అభివృద్ధి చేసిన సామాజిక, రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. ఒకరిని మరొకరు దూషించుకునే స్థితికి చేరుకుం ది ప్పుడు. ఈ మార్పులవల్ల వర్ణాశ్రమ ధర్మాలకు బదు లుగా కులాల ప్రాధాన్యం వచ్చింది. రాజకీయ, సామాజిక, మతపర, సాంస్కృతిక వ్యవహారాల్లో కులాల ప్రస్తావన లేకుండా ఏదీ జరుగలేని స్థితికి చేరుకున్నాం. బ్రాహ్మణ వ్యతిరేకత చివరకు కులాల వ్యతిరే కతకు దారితీసింది. ఒక కులం వారు, మరో కులాన్ని దూషించే పరిస్థితులొచ్చాయి. అగ్ర కులాల ని, వెనుకబడిన కులాలని, దళితులని భేదాలొచ్చా యి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి