26, నవంబర్ 2017, ఆదివారం

Gandhi account గాంధీగారి ఖాతా

Gandhi account  గాంధీగారి ఖాతా! 



బహుశా.. యావత్ విశ్వంలో.. మహాత్మాగాంధీ అంతటి బ్యాంకింగ్ కస్టమర్ వుండరు 
మరణానంతరం కూడా ఆయన ఖాతాలో డబ్బులు జమ అవుతుండడం దీనికి నిదర్శనం. 
ఈ ‘గాంధీగారి ఖాతా’ అనే పదం, పదప్రయోగం ఎప్పుడు వచ్చిందో తెలియదు కానీ, విస్తృతంగా వాడుకలో వున్న పదం.
ఎవరికన్నా నాబోటివాడికి అప్పు ఇచ్చినప్పుడో, చేబదులు ఇచ్చినప్పుడో.. ఇక అవి తిరిగిరావని ఖాయం చేసుకున్నాక.. ఆ డబ్బులను గాంధీగారి ఖాతాలోకి లెక్కవేసుకోవడం కద్దు.
జాతిపిత పేరిట ఈ నానుడి రావడం చాలా విచిత్రం.
సొతంత్ర సముపార్జనలో భాగంగా గాంధీగారు ఊరూరూ తిరిగి జోలెపట్టారు. పుట్లింటివాళ్లు, మెట్టినింటోళ్లు ఇచ్చిన గాజులు, చెవి దుద్దులు, మంగళసూత్రాలతో సహా గాంధీగారి జోలెలో వేశారు. ఆడది అర్ధరాత్రి స్వేచ్చగా తిరగగలిగే సొంతంత్రాన్ని కాంక్షించి గాంధీగారి ఖాతాలో జమచేశారు. ఆడవాళ్లే కాదు.. మగవాళ్లు కూడా.
గాంధీగారి ఖాతాలో జమచేసిన వాటికి ప్రతిఫలంగా వాళ్లెవరూ వడ్డీ అడగలేదు, అసలు అడగలేదు. కేవలం దేశానికి స్వతంత్రం అడిగారు. మనుషులకు స్వతంత్రం అడిగారు.
గాంధి పుట్టిన దేశమా ఇది అని అప్పుడప్పుడూ పాటలు వస్తుంటాయి. అది మహాత్మాగాంధీ గురించి కాదు. అనేక గాంధీలు పుట్టిన దేశమేనా అని ఒక వ్యంగ్యం అని అనుకుంటాను.
గాంధీగారి ఖాతా అనేది కూడా.. స్విస్ బ్యాంకుల్లోనూ కనిపించని, వెనక్కు తీసుకురాలేని ఖాతా మొత్తం అనుకుంటాను.
ఇంతకూ మన జాతిపిత జోలె పట్టుకుని సేకరించిన మొత్తానికి జమాఖర్చులేమైనా వున్నాయా? అని డౌటనుమానం.
కొల్లాయికట్టిన జాతిపిత లెక్కలు రాయకుండా వుండరు.
అన్ని వివరాలూ వుంటే కూడా జాతిపిత పేరిట గాంధీగారి ఖాతా అని నవ్వేసుకోవడం జాతిద్రోహం కదా!  

17, నవంబర్ 2017, శుక్రవారం

Ayurveda ఆయుర్వేదం

Ayurveda ఆయుర్వేదం ...joke

ఆయుర్వేదంలో ఇన్ని అద్భుతాలు వున్నాయా?  ఏకంగా కనపడకుండా పోవచ్చా?  
వస్తుగుణదీపిక పుస్తకం తిరగేస్తుంటే.. నల్లగుంటగలగర గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి.
గుంటగలగర ఆకు గురించి అందరికీ తెలిసిందే. ఈ ఆకును కొబ్బరినూనెలో మరిగించి తలకు రాసుకుంటారు. అలాగే ఈ ఆకుతో రోటిపచ్చడి కూడా చేసుకోవచ్చు. భృంగరాజ్ తైలం అని మార్కెట్లో కూడా దొరుకుతుంది.
గుంటగలగరకు అనేక ఔషధ గుణాలు వున్నాయి. అందులో సందేహం లేదు.
నల్లగుంటగలగర విశేషాలను ఇప్పుడు చెప్పుకుందాం.
చిత్రంలో వున్నది మామూలు గుంటగలగర. కృష్ణగుంటగలగర పువ్వులు నీలం రంగులో వుంటాయి.
నల్లగుంటగలగర మొక్క మొత్తాన్ని నీడలో ఆరబెట్టాలి. బాగా ఎండిన తర్వాత చూర్ణం చేసి, ప్రతిరోజు ఉదయం సుమారు బేడయెత్తు చూర్ణాన్ని ఆవు పెరుగుతో కలిపి ఒక సంవత్సరం పాటు పుచ్చుకోవాలి.
పాటించాల్సిన నియమాలు:
ఈ సంవత్సర కాలములో నియమనిష్టలతో వుండాలి. లఘువైన శాకాహారాలను భుజించాలి. పులుపు, కారాలను తగ్గించాలి. స్నాన, పాన, భోజన శయనాదులలో నియమం కలిగి వుండాలి. లైంగిక సంభోగములు వుండరాదు.
ఏడాదికాలంలో చేకూరే ఫలితాలు:
1. మొదటి నెలలో సమస్త రోగములు నివారణ అగును 
2. రెండవ నెలలో తెల్లని వెంట్రుకలు నల్లబడును 
3. మూడవ నెలలో బుద్ధికి బలము కలుగును 
4. నాలుగవ నెలలో మనని చూసి శత్రువులు భయపడుదురు 
5. ఐదవ నెలలో మనను అందరూ మర్యాద చేయుదురు 
6. ఆరవ నెలలో మనకు ఐశ్వర్యం కలుగును 
7. ఏడవ నెలలో మన దేహకాంతి భేదించును 
8. ఎనిమిదో నెలలో గొప్పవాళ్లం అవుతాం 
9. తొమ్మిదో నెలలో మనం ఒక్కోసారి కనిపిస్తాం.. ఒక్కోసారి కనిపించం  
10. పదవ నెలలో మననెవ్వరూ కనుగొనజాలరు     (ఎవరన్నా కాలింగ్ బెల్ కొడితే తలుపు తీస్తాంకానీ.. వచ్చిన వాళ్లకు మనం కనపడం అన్నమాట. అప్పులవాళ్లు చెప్పులరిగేలా తిరుగుతుంటారు మన జాడకోసం. పోలీసులు సీసీటీవీ ఫుటేజులను తెగ వెదుకుతారు మన అజాపజాకోసం. )
11. పదకొండవ నెలలో మహా శూరులం అవుతాం 
12. పన్నెండవ నెలలో మహాత్ములం అవుతాం 
..
ఈ సంగతి తెలియగానే.. బాబ్బాబు అదెక్కడ దొరుకుతుందో కాస్త తెచ్చిపెట్టు. ఏడాదిపాటు పాటిస్తాను. నీతో.. ఈ కుక్కలు, పిల్లులు, కోళ్లతో వేగలేకపోతున్నాను. ఎవరికీ కనిపించకుడా మాయమైపోతాను అన్న. మనుషులకు కనబడవేమో కానీ.. కుక్కలు, పిల్లులు, కోళ్లకు కనిపిస్తావేమో అని డౌటనుమానం ఎక్స్ ప్రెస్ చేశాను.

Chiranjeevi చిరంజీవి

Chiranjeevi చిరంజీవి ...

చిరంజీవి- స్వయం క్రుషి: సినీ రంగం లో ప్రవేశించిన 1978 నుంచి 1980 వరకు చిరంజీవి నటించిన సినెమాలు దాదాపు ఎవ్వరికీ తెలియదు. మొదటి 25 సినెమాలు చెప్పమంటే చిరంజీవి నే చెప్పలేడు అంటే అతిశయోక్తి కాదు. 1980 లో తమ కులపోడే కదా అని అల్లు రామలింగయ్య తన కూతురిని ఇచ్చి పెళ్ళి చేశాకే చిరంజీవి కి ఫ్లాట్ ఫార్మ్ దొరికింది, చెప్పుకోటానికి ఒక అడ్రస్ దొరికింది.
భారత చలన చిత్ర రంగం లో అత్యధికం గా ఫుష్ అప్, బ్యాక్ అప్ ఉంది చిరంజీవి ఒక్కడికే. ఒక వైపు పిల్లనిచ్చిన మామ, ఇంకో వైపు బావ మరిది అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్. మరోవైపు ఎంత చెత్త సినెమా లో నటించినా అల్లు అరవింద్ ఆధ్వర్యం లోని అత్యధిక దియోటర్స్. మామూలు చిరంజీవి ని మెగా స్టార్ చిరంజీవి ని చేసింది గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ & అల్లు రామలింగయ్య గారే .
చిరంజీవి కి మొదటి అవార్డ్ తెచ్చి పెట్టిన "శుభలేఖ" కానీ ఆ తర్వాత అవార్డ్ తెచ్చి పెట్టి గుర్తింపు ఇచ్చిన "విజేత" కానీ నిర్మించింది అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ నే.
విజేత సినెమా కి అవార్డ్ రాకముందే చిరంజీవి 80 వరకు సినెమాలు చేశాడు.
దర్శక రత్న దాసరి నారాయణ రావు గారు కూడా తన కుమారుడి చేత రెండు , మూడూ సినెమాలు తీసి గుర్తింపు రాలేదు అని ఆపేశారు. కానీ, చిరంజీవి కి గుర్తింపు తేవటానికి అల్లు రామలింగయ్య, అల్లు అరవింద్ 80 సినెమాల వరకు పుష్ అప్, బ్యాక్ అప్ ఇస్తూనే ఉన్నారు. 1985 లో విజేత సినెమాకి అవార్డ్ వచ్చేంతవరకు చిరంజీవి నటించిన సినెమాలు 80. ఆ తర్వాత 30 సంవత్సరాలలో చిరంజీవి నటించిన సినెమాలు 70.
ఆ తర్వాత కూడా, దియోటర్స్ అన్నీ తమ గుప్పెట్లో ఉన్న ఆ నలుగురు లో ఒకరు అయిన అల్లు అరవింద్ చిరంజీవి సినెమాలకి ఎక్కువ దియోటర్స్ ఇచ్చి బ్యాక్ అప్ ఇస్తూనే ఉన్నారు.
1978 కంటే ముందే లక్షల్లో ఫీజు కట్టి మద్రాస్ ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ లో కోర్స్ చేయగలిగినంత డబ్బు చిరంజీవి ఫాదర్ ఇచ్చాడు.
వరుస ప్లాఫ్ లు వచ్చిన ప్రతిసారీ హిట్ అయిన పరభాషా సినెమా ని తెలుగు లో తీయటం చిరంజీవి కి అలవాటు. మొట్టమొదటి సినెమాల్లో ఒకటైన మనవూరి పాండవులు కూడా రీమేక్ సినిమా నే. ఈ మధ్య థాగూర్ సినెమా ముందు ప్లాఫ్ లతో కొట్టుమిట్టాడుతుంటే ఆల్ రడీ మరో హీరో రాజ శేఖర్ కొన్న సినెమా ని మళ్ళీ ఎక్కువ డబ్బులు ఆశ చూపి మచి పూచి మారేడు కాయ చేసి ఠాగూర్ సినెమాని దక్కించుకొని హిట్ కొట్టాడు అని వార్తల్లో చూశాం. గ్యాప్ తర్వాత వచ్చిన చిరంజీవి మళ్ళీ తమిళం లో హిట్ అయ్యిన కత్తి సినెమా నే తెలుగు లో తీచి నటించాడు.
మొత్తం 25 వరకు వేరే భాషల్లో సూపర్ హిట్ అయిన వాటిని తీసుకొని తెలుగు లో నటించాడు చిరంజీవి.
ఏతా వాతా నేను చెప్పదలచుకున్నది ఒక్కటే. చిరంజీవి వి స్వయం క్రుషి కి సంబందం లేదు. అమితాబ్ బచ్చన్ కూడా అభిషేక్ బచ్చన్ కి కొంతవరకే పుష్ అప్ ఇచ్చాడు. కానీ, చిరంజీవి కి ప్రస్తుతం కూడా అల్లు అరవింద్ ఎక్కువ దియోటర్స్ రూపం లో పుష్ అప్, బ్యాక్ అప్ ఇస్తూనే ఉన్నాడు. 
అన్నీటికంటే ముఖ్యం గా ఆ రోజుల్లో ని రామారావు, నాగేశ్వరావు, క్రిష్ట్న, శోభన్ బాబు, మోహన్ బాబు. ఇంకా, ఆ నలుగురు టాప్ హీరోల్లో బాలక్రిష్న, నాగార్జున, వెంకటేష్ ఒకే సామాజిక వర్గం అవ్వటం వలన మిగతా అన్ని సామాజిక వర్గాల వాళ్ళు చాలా మంది చిరంజీవి కి పుష్ అప్, బ్యాక్ అప్ ఇచ్చి ఆదరించారు. ఆ సామాజిక వర్గం లో పడని వాళ్ళు కూడా చిరంజీవి కి అండ దండలు ఇచ్చి పెద్దోన్ని చేశారు .
ఏది ఏమైనా, స్వయం గా ఎదగని వాళ్ళ పక్కన స్వయం క్రుషి పేరు వాడుతుండటం వలనే స్వయం క్రుషి తో ఎదిగిన ఉదయ కిరణ్ లాంటోళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
ఎవరో మన మెదళ్లలో నింపిన సమాచారం కాకుండా ఉన్నది ఉన్నట్లు చూడగలిగితే నిజాలు మనకే అవగతం అవుతాయి. భావోద్వేగాన్ని పక్కన పెట్టి నిజం గా స్వయం క్రుషి తో ఎదిగిన వారిని రేపటి పౌరులకి పరిచయం చేయండి.

India ఇండియా భారత్ భారతదేశం

India ఇండియా భారత్ భారతదేశం

మీరు గమనిస్తే భారత్ ఓ ప్రాచీన దేశం. అది ఎంత?
900 సంవత్సరాల ముందు వరకు అమెరికా లేదు ... కొలంబస్ తెలిపాడు ప్రపంచానికి !
2000 సంవత్సరాల ముందు వరకు ఇజ్రాయిల్ లేదు ... ఏసు అనే వ్వక్తి తెలిపాడు ప్రపంచానికి
5000 సంవత్సరాల ముందు వరకు చైనా లేదు .. మన బోధి ధర్ముడు తెలిపాడు ప్రపంచానికి
1400 సంవత్సరాల ముందు వరకు అసలు ఇస్లాం దేశాలే లేవు ... కొత్తగా ఏర్పడినవి
మరీ భారత దేశం వయసు ఎంత?
ప్రపంచంలో ప్రపంచ చరిత్ర కారుల,పరిశోధకుల కొలమానాలకు అందనంత వయసు నా దేశం వయసు ఇదీ నా భారత్ గొప్పతనం
ప్రపంచ తత్వవేత్త, పురావస్తు శాస్త్రవేత్త, జర్మన్ సైంటిస్ట్ అయిన "ఆర్నాల్ టాన్బీ" పరిశోధన ప్రకారం....
ప్రపంచంలోని 28 ప్రాచీన సంస్కృతులు గల దేశాలలో నేటికీ సజీవంగా ఉన్న సంస్కృతి గల దేశం భారతదేశం మాత్రమే
వైదిక సంస్కృతికి మరో రూపాంతరమైన "ఈజీప్ట్ సంస్కృతి" కూడా నేడు లేదు. కేవలం " పైన పిరమిడ్-కింద మమ్మీలు " మిగిలాయి
విశ్వవిజేత అలెగ్జాండర్ భారత్ లోనే ఓడించబడ్డాడు పురుషోత్తమునిచే. అతని "గ్రీకు దేశం" నేడు లేదు
ఎగుమతుల ద్వార ప్రపంచ వర్తక సామ్రాజ్య దేశంగా మారిన "రోమ్" నేడు లేదు
ఇలా అస్తేరియా, సుమేరియా, బాబిలోనా, మెసపటోనియా...ఇలా 27 దేశాలు నేడు లేవు
ఎన్ని సంస్కృతులు నాశనమైనా తన సంస్కృతి ఉనికిని కాపాడే యోధులకు జన్మనిచ్చినదే...
"నా దేశం-భారత దేశం"
ప్రపంచంలో ఆక్రమణకి గురికాని దేశం ఏమైనా ఉందా...? లేదనే అనాలి.
మరీ ఒక్క ఆక్రమణ చేయని దేశం ఏమైనా ఉందా ఇంకా...? ఉంది.
చరిత్ర పుటల్లో నాటికి...నేటికి...
"శాంతికి నిలయ దేశం-నా భారత దేశం"
ఈజీప్ట్ మీద పాలస్తీనా,అరేబియా దేశాల దండయాత్రలతో 1500 సం.ల్లో మొత్త సంస్కృతి నాశనమయింది. నేడు ఇస్లాం దేశంగా మారింది
రోమ్ మీద కేవలం 7,8సం..ల దాడులతో దాని సంస్కృతి నాశనం చేసారు. ఇప్పుడు ఇస్లాం దేశం అయిపోయింది
మరి మన భారతీయ సంస్కృతిపై జరిగిన దాడులెన్ని?
శకులు,తుష్కరులు,మొఘలులు,సుల్తానులు,నవాబులు,షేక్ లు,పఠాన్ లు,పోర్చుగీస్ వారు,ఫ్రెంచ్ వారు,డచ్ వారు,బ్రిటీష్ వారు...ఇలా ఒకరి తర్వాత ఒకరు దాడులు చేసారు. కానీ ఏంటి లాభం !? ఏమి పీక లేక పోయారు
ప్రపంచానికి మన సంస్కృతి గొప్పతనం తెలియజేయటం.
ఇంకా ఇన్ని దండయాత్రల తర్వాత కూడా నేటికి నిరంతరాయంగా ప్రపంచ ప్రాచీన సంస్కృతికి నిలయమే...
"హైందవ దేశం-నా భారత దేశం"ప్రపంచానికి విజ్ఞానామ్ నేర్పించిన దేశం నా దేశం
మరీ దేశభక్తుల విషయం...
1857 మే 10 సిపాయిల తిరుగుబాటు మొదలుకుని 1947 ఆగస్ట్ 15 వరకు 90సం వ్యవధిలో నా దేశం లో ఇతర దేశస్తుల చేత ఉరితీయబడి బలిదానం ఇచ్చిన వారు ఎందరో తెలుసా?
4 లక్షల 50 వేలకు పైగా కేవలం ఉరితీయబడినవారు మాత్రమే !
మరి ఇది మన లైబ్రరీలలో ఉంటుందా ఉండదు
ఎక్కడ ఉంటుంది అంటే "Oxford library" లో ఉంటుంది
ఎందుకంటే దెబ్బలు తిన్నాక కూడా మళ్ళీ భారత్ మీద దాడి చేయకూడదని గుర్తు పెట్టుకోవటానికి
ఇది నా దేశంలో పుట్టిన సగటు భారతీయుని దేశ భక్తి.
ఈ కనీస ఙ్ఞానం లేని మూర్ఖులే నా ధర్మాన్ని, నా దేశాన్ని విమర్శిస్తారు.

8, నవంబర్ 2017, బుధవారం

Coal బొగ్గు Open cast ఓపెన్ కాస్ట్

Coal బొగ్గు Open cast ఓపెన్ కాస్ట్ 


బొగ్గు ఉత్పత్తిపై ఉన్న శ్రద్ధ కార్మికుల ,ఉద్యోగుల కనీస
సౌకర్యాలను కల్పించడముపై కూడా చూపాలి.  ఓపెన్ కాస్ట్
ప్రాజెక్ట్ కార్మికుల ఉద్యోగుల " రోడ్ ప్రయాణ భద్రతను కల్పించాలి. ద్విచక్ర వాహానాలపై షిప్టు సమయాలలో డ్యూటీకి వచ్చి పోతుంటారు. ఆ సమయములో బొగ్గు ట్రాన్స్ పోర్ట్ లారీలు , ఇసుక ట్రాన్స్ పోర్ట్ లారీలు కూడా నడువడము వలన సెకండ్, నైట్ షిప్టుల కార్మికులు , ఉద్యోగులు భయముతో ప్రయాణించుచున్నారు. ప్రమాదాలు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. షిప్టు
సమయాలలో బొగ్గు ట్రాన్స్ పోర్ట్ లారీలను బంద్ పెట్టాలని
DGMS/ డైరెక్టర్ ఆఫ్ జనరల్ మైన్శ్ సేప్టీ మార్గదర్శకాలు
ఉన్నాయి. అయిన సింగరేణి యాజమాన్యము పాటించడము లేదు.రోడ్ పై / వెంబడి స్ట్రీట్ లైట్స్ లేవు .
కోల్ ట్రాన్స్ పోర్ట్ చెక్ పోస్ట్ నుండి హాజర్లుపడే సైట్ ఆపీస్ Attendance Office వరకు రోడ్ గుంతలతోను , రోడ్ మద్యన పేరుక పోయిన మట్టి గడ్డలతోను ఉండటము వలన సైకిల్ మోటార్స్ స్లిప్ అయి ప్రమాదాలు జరుగుచున్నవి . ఈ వారము రోజులలో ఇద్దరు కార్మికులు
స్లిపై రోడ్ పై పడ్డారు. గాయాలతో బయటపడినారు .
ఇక మంచి నీళ్లు . బొగ్గు , ఓవర్ బర్డెన్ క్వారీలలో రంజన్
లలో మంచి నీళ్లు పోస్తారు . పై విభాగాలైన క్యాంటిన్ , టీ టైం రెస్ట్ షెల్టర్ లలో ప్రైవేట్ ట్యాంకర్ లతో మంచి నీళ్లను
పోస్తారు. అయితే ఇప్పుడు గోదావరిలో నీటి ప్రవాహము
తక్కువగా ఉన్నందున నీరు కలుషితమయ్యే అవకాశము
ఉన్నది. ఎందుకంటే ? " సింగరేణి రక్షిత మంచి నీటి ఇన్ పిల్ట్రేషన్ గ్యాలరీ వెల్స్ 100 మీటర్ల ఎగువన గోదావరి నదిలో డ్రైనేజీ నీళ్లు కలుస్తాయి. అయితే " రామగుండం
కార్పొరేషన్ రక్షిత మంచి నీళ్ల ఇన్ పిల్ర్టేషన్ గ్యాలరీ వెల్స్
దిగువన డ్రైనేజీ నీళ్లు గోదావరి నదిలో కలుస్తాయి. అంటే
సింగరేణి రక్షిత మంచి నీళ్ల కంటే ----- రామగుండం ఏరియా రక్షిత మంచి నీళ్లు రక్షితమైనవి. పోయిన ఎండ
కాలములో నీళ్లు కలుషితమైతే అప్పటి కరీంనగర్ జిల్లా
కలెక్టర్ స్పందించి సింగరేణి యాజమన్యాన్ని అభిశంషించింది. మందలియడము జరిగింది. స్వయముగా మేనేజుమెంటే సింగరేణి నల్ల నీళ్లను తాగవద్దని ప్రకటించింది.
ఇప్పుడు మేడపల్లి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ కార్మికులకు
ఉద్యోగులకు రామగుండం కార్పొరేషన్ రక్షిత మంచి నీళ్లను సరఫరా చేయాలి. రోడ్ పైన ఉన్న గుంతలను
ప్యాచ్ వర్క్ ద్వారా లెవల్ చేయాలి. రోడ్ పైన పేరుకపోయిన మట్టి గడ్డలను తొలగించాలి. రోడ్ వెంబడి
స్ట్రీట్ లైట్స్ ను ఏర్పాటు చేయాలి. షిప్ట్ సమయాలలో బొగ్గు ట్రాన్స్ పోర్ట్ , ఇసుక ట్రాన్స్ పోర్ట్ లారీలను బంద్ పెట్టాలని కార్మికులు ,ఉద్యోగులు కోరుచున్నారు.

7, నవంబర్ 2017, మంగళవారం

Elections ఎన్నికలు

Elections ఎన్నికలు

2019 వచ్చే అసెంబ్లీ, లోక్ సభ జమిలీ ఎన్నికలు రాయలసీమ వాసులకు కొత్త ముఖాలను పరిచయం చేయనున్నాయా? అంటే తాజా పరిణామాలు అవుననే అంటున్నాయి. ప్రస్తుతం రాజకీయాల్లో ఉంటున్న వారితోపాటు వారి వారసులు, కుటుంబ సభ్యులు బరిలోకి దిగడమే కాదు.. కొందరు వెనక్కు తగ్గి మరి కొందరు ముందుకు వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. చివరకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా స్థల మార్పును కోరుకుంటున్నారని వినికిడి. ముందుగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేలా చేసి తర్వాత కొడుకు నారా లోకేశ్‌ను తన క్యాబినెట్ లోకి తీసుకున్న చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో తనయుడిని కూడా ఎన్నికల బరిలోకి దించాల్సిన అవసరం ఉన్నది. పలు నియోజకవర్గాలను పరిశీలనలోకి తీసుకున్నా సొంత సామాజిక వర్గం జనాభా గట్టిగా ఉన్న నియోజకవర్గాలను బాబు పరిగణనలోకి తీసుకున్నారని సమాచారం. అలా కానీ పక్షంలో కుప్పుం నుంచే నారా లోకేశ్‌ను రంగంలోకి దించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
సొంత చిత్తూరు జిల్లాలోని సురక్షిత స్థానం 'కుప్పం' వదిలేయడం వల్ల తనయుడు లోకేశ్.. సేఫ్ జోన్‌లో చంద్రబాబు తలపోస్తున్నారని విశ్వసనీయంగా తెలిసింది. సీఎంగా చంద్రబాబు తాను కొత్త అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని సంకల్పించారని వార్తలొచ్చాయి. ప్రత్యేకించి కర్నూల్ జిల్లా నంద్యాల అసెంబ్లీ స్థానం నుంచే పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న మాట గట్టిగా వినిపిస్తున్నది. ఇక ఆయన వియ్యంకుడు, హిందూపూర్ ఎమ్మెల్యే బాలక్రుష్ణ ఈ దఫా.. హిందూపురం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసే సంకేతాలు కనిపిస్తున్నాయి.
చంద్రబాబుకు ప్రత్యామ్నాయ సీటు నంద్యాల
దీని ప్రకారం నంద్యాల అసెంబ్లీ స్థానం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భూమా కుటుంబ సభ్యులకు దక్కే అవకాశాలు లేవని స్పష్టమవుతోంది. తనయుడు లోకేశ్‌కు కుప్పం.. సేఫ్‌గా ఉంటుందని, తన కోసం నంద్యాల సీటును ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయని వినికిడి. ఇటీవల జరిగిన నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఎంత చెడ్డ పేరు తెచ్చుకున్నా పార్టీ భారీ మెజారిటీతో గెలుపొందే సరికి చంద్రబాబు లెక్కలు, అంచనాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే చంద్రబాబు ఇప్పుడు మదిలో తలెత్తిన వ్యూహానికి కట్టుబడి ఉంటాడా? లేదా? అన్న విషయం వేచి చూస్తే గానీ అర్థం కానీ అంశం.
నల్లారి కిరణ్ కుమార్ రాజకీయ భవితవ్యం ఆసక్తికరమే
కర్నూల్ ఎంపీ సీటు నుంచి కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ పడుతారని వినికిడి. ఇక నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి ఎవరిని పోటీలోకి దించుతారన్న విషయం ఇంకా స్పష్టత రానే లేదు. చిత్తూరు జిల్లాలో ప్రముఖ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి సీఎంగా పని చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పునరాగమనం సంకేతాలిస్తున్నారు. ఇప్పటికిప్పుడైతే ఆయన పోటీ చేసే అవకాశాలు కనిపించడం లేదు గానీ.. ఆయన ఎక్కడ నుంచి పోటీ చేసినా ఆసక్తికర పరిణామమే అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు
కడప నుంచి అవినాశ్ సస్పెన్స్.. షర్మిలకు చాన్స్?
చిత్తూరు జిల్లాతోపాటు కడపకు అనుసంధానమైన రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎంపీ మిధున్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి పోటీ చేసి.. కొడుకుని అసెంబ్లీకి పంపాలని యోచిస్తున్నారని వార్తలొచ్చాయి. ఇక కడప లోక్ సభ స్థానం నుంచి ప్రస్తుత ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పోటీ చేస్తారా? అన్నది అనుమానమే. వైఎస్ షర్మిల, వైఎస్ భారతిల్లో ఎవరో ఒకరు పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. షర్మిలను ఒంగోలు నుంచి గానీ, విశాఖపట్నం నుంచి గానీ పోటీ చేయించే చాన్స్ కనిపిస్తున్నది.
పోటీ చేయనన్న జేసీ.. కొడుక్కి చాన్స్ లభిస్తుందా?
అనంతపురం జిల్లాలోని రెండు లోక్‌సభా స్థానాల పరిధిలో మార్పులు జరిగే అవకాశాలు పుష్కలం. అనంతపురం స్థానం నుంచి ప్రస్తుత ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించేశారు. ఇక ఆయన తన తనయుడ్ని పోటీలోకి దించాలని భావించినా సీఎం చంద్రబాబు ఒప్పుకుంటారా? అన్నది అనుమానమే. అందునా జేసీ దివాకర్ రెడ్డి కుటుంబంతో చంద్రబాబు నాయుడుకు రాజకీయ అవసరాలేమీ లేవు. ఈ నేపథ్యంలో వారిని పూర్తిగా పక్కన బెట్టినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. అనంతపురం లోక్ సభ స్థానానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి ఎవరన్న విషయం స్పష్టత రావాల్సి ఉన్నది. అలాగే హిందూపురం స్థానం నుంచి కూడా కీలక మార్పులు జరుగవచ్చునని భావిస్తున్నారు.
వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా దగ్గుబాటి పురందేశ్వరి?
ప్రస్తుత ఎంపీ నిమ్మల కిష్టప్ప తన స్థానాన్ని బాలక్రుష్ణ కోసం త్యాగం చేసేందుకు సిద్దంగా ఉన్నారట. బాలక్రుష్ణ హిందూపురం లోక్ సభ స్థానానికి పోటీ చేస్తే, అసెంబ్లీ స్థానానికి నారా వారి కుటుంబం నుంచి ఎవరో ఒకరు.. నారా లోకేశ్ గానీ, ఆయన భార్య బ్రాహ్మణి ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయనే మాటలు వినిపిస్తున్నాయి. కుప్పం అసెంబ్లీ స్థానం నుంచి లోకేశ్ పోటీ చేయడం కుదరకపోతే బాలక్రుష్ణ తన అల్లుడి కోసం సీటు త్యాగం చేసి.. లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలను పరిశీలిస్తున్నారని వినికిడి. అయితే దగ్గుబాటి పురందేశ్వరిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని హిందూపురం లోక్ సభ సీటు కేటాయించాలని వైఎస్ జగన్ తలపోస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక అనంతపురం జిల్లా నుంచి పల్లె రఘునాథరెడ్డికి వచ్చే అసెంబ్లీ టిక్కెట్ లభించడం సందేహస్పదమేనని అంటున్నారు. పల్లె రఘునాథరెడ్డి ప్రాతినిధ్యం వహించిన పుట్టపర్తి అసెంబ్లీ స్థానం నుంచి ఎంపీ నిమ్మల కిష్టప్ప తన తనయుడిని రంగంలోకి దించాలని యోచిస్తున్నారని వినికిడి.

LPG Gas వంటగ్యాస్‌

LPG Gas వంటగ్యాస్‌ ...

ఇటీవల ప్రకటించినట్లుగానే వంటగ్యాస్‌పై సబ్సిడీ భారాన్ని వదిలించుకోవాలని ప్రకటించినట్లుగానే కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం అడుగులు ముందుకు సాగుతున్నాయి. పేదల సంక్షేమానికి తిలోదకాలిస్తున్న కేంద్ర సర్కార్.. ఆచరణలో బడాబాబులకు, కార్పొరేట్ సంస్థలు వాటికి సారథ్యం వహిస్తున్న పారిశ్రామిక యాజమాన్య సంఘాల ఆధ్వర్యంలో అడిగిందే తడువుగా రాయితీలు, పన్ను చెల్లింపుల్లో సబ్సిడీ కల్పిస్తున్నది. ప్రతి నెలా చివరి ఆదివారం 'మన్ కీ బాత్' అనే పేరుతో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. తద్వారా ఆయన మనస్సులో ఆలోచన ఆలస్యంగా బయటపడుతున్నది.
ప్రతినెలా గ్యాస్‌ ధర పెంచుతూ పేదల నడ్డి విరుస్తున్నారు. ఈ పెంపు ఎంత అని తెలిస్తే ముక్కుపై వేలేసుకోవాల్సిందేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. గత 16 నెలల్లో రాష్ట్ర ప్రజలపై సుమారు రూ.196.41 కోట్ల భారం గ్యాస్‌ వినియోగదారులపై మోపారంటే నమ్మక తప్పదు. గతేడాది ఆగస్టులో సబ్సిడీ సిలిండర్‌ ధర రూ.567.5 ఉండేది. ఇప్పుడది రూ.808కు చేరింది. ఏతావాతా ఒక సిలిండర్‌పై రూ.240.5 పెరిగింది.
తెలంగాణలో 81.67 లక్షల మందికి సబ్సిడీ
తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ చమురు సంస్థల్లో ఇండేన్‌కు 35.28 లక్షలు, భారత్‌ 29.50 లక్షలు, హెచ్‌పీ గ్యాస్‌కు 20.74 లక్షల చొప్పున మొత్తం 85.52 లక్షల గ్యాస్‌ వినియోగదారులున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 'గివ్‌ ఇట్‌ అప్‌' పిలుపునకు తెలంగాణలో 3.85 లక్షల మంది సబ్సిడీ ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం 81.67 లక్షల మంది సబ్సిడీని పొందుతున్నారు. ఈ లెక్కన బండ భారం సుమారు రూ.196.41 కోట్లకు చేరిందంటే అతిశయోక్తి కాదు. గ్యాస్‌పైన సబ్సిడీని కేంద్రం నెల నెలా తగ్గించుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ప్రకటనను తూ.చ. తప్పకుండా పాటిస్తూ నెలనెల ధరలు పెంచుతున్నది. ఈ నెలలో రూ.4.50 పెంచింది. ఈ విధంగా ఏడాదిలోగా సబ్సిడీ గ్యాస్‌ అనే మాట వినపడకుండా ప్రయత్నిస్తున్నది. ఒకేసారి భారం మోపకుండా దశలవారీగా ప్రజలపై బండ బారం వేస్తూనే ఉన్నది.
16 నెలల్లో 19 సార్లు గ్యాస్ ధర పెంపు
సబ్సిడీ ఎత్తి వేయాలనే యోచనతోనే కేంద్రం నెలనెల ఇలా గ్యాస్‌ ధర పెంచుతున్నదని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. 2016 జూలైలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తర్వాత ప్రభుత్వ రంగ ఆయిల్‌ సంస్థలు ఈ ధరలను 16 నెలల్లో 19 సార్లు సవరించాయి. ఇందులో ఎక్కువ సార్లు పెరుగుదలే ఉండటం గమనార్హం. 2016 ఆగస్టులో రూ.567.5 ఉన్న ధర అదే ఏడాది సెప్టెంబర్‌లో రూ.545.5కి పడిపోయింది. నాటి నుంచి పెరగడమే తప్ప తగ్గలేదు. అదే ఏడాది అక్టోబర్‌లో రూ.568, నవంబర్‌లో 609, డిసెంబర్‌లో రూ.686కు చేరి ఆ ఏడాది నాలుగు నెలల వ్యవధిలోనే ఒక్కో సిలిండర్‌పై రూ.118.5 భారం వేశారు. ఇక 2017 ఆగస్టులో మినహా ఇప్పటి వరకు తగ్గింపు ఊసేలేదు. ఈ ఏడాది జనవరిలో రూ.687 ఉన్న ధర మార్చి నాటికి రూ.847కు చేరడం ఆందోళన కలిగించే అంశం.
ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ.808
కేవలం మూడు నెలల్లోనే సిలిండర్‌పై ఏకంగా రూ.160 బాదేయడం విశేషం. ఆ తరువాత రెండు మూడు నెలలు పదుల్లో తగ్గించి అక్టోబర్‌, నవంబర్‌ నాటికి వందల్లో పెంచేశారు. ప్రస్తుతం గ్యాస్‌ ధర రూ.808 వసూలు చేస్తున్నారు. కాగా, వంటగ్యాస్‌ను సబ్సిడీపై పొందుతున్నవారిలో సాధారణ కుటుంబాలే ఎక్కువ. ప్రభుత్వం నేరుగా పెట్రోలియం సంస్థలకు సబ్సిడీ సొమ్మును సర్దుబాటు చేసి వినియోగదారులకు తక్కువ ధరకే గతంలో సిలిండర్‌ పంపిణీ చేసేది. సబ్సిడీని పెట్రోలియం సంస్థలకు సర్దుబాటు చేయకుండా వినియోగదారుల నుంచి నిర్ణీత సొమ్ము వసూలు చేసి రీయింబర్స్‌మెంట్‌ రూపంలో కేంద్రం వినియోగదారుల బ్యాంకు ఖాతాకు నగదు బదిలీ చేసే విధానం అమలు చేస్తున్నది. ఈ లెక్కన ఒక్కో సిలిండర్‌పై రూ.90 నుంచి రూ.200 వరకు సొమ్ము బ్యాంకు ఖాతాల్లో జమయ్యేది. అంటే గ్యాస్‌ సిలిండర్‌పై కేంద్రం అంతమొత్తాన్ని భరించేది. వంటగ్యాస్‌పై సబ్సిడీ భారాన్ని వదిలించుకోవాలని ఇటీవలే కేంద్రం ప్రకటించింది. ఈ క్రమంలో ప్రతినెలా గ్యాస్‌పై రూ.4 చొప్పున ధర పెంచాలని నిర్ణయించింది. ఇలా ప్రతినెలా ధర పెంచుతూ పోయి 2018 మార్చి వరకు మొత్తం సబ్సిడీని ఎత్తేయాలని యోచిస్తోంది. గత నెల సబ్సిడీ సిలిండర్‌ ధర రూ.714 ఉండగా ఈ నెల నుంచి పెరిగిన ధరతో కలిపి రూ.808కు చేరింది.
వాణిజ్య సిలిండర్ ధర ఒకేసారి రూ.400 పెంపు
సబ్సిడీ సిలిండర్‌ ధరతో పోల్చితే నాన్‌ సబ్సిడీ ధర సుమారు రెండింతలు పెరిగిందంటే ఆశ్చర్యం కలగక మానదు. గతేడాది ఆగస్టులో సబ్సిడీయేతర సిలిండర్‌ ధర రూ.1,075.5 ఉండేది. ఈ నెల నవంబర్‌లో ఏకంగా 1,464కు చేరింది. గత 16 నెలల కాలంలో అక్షరాల రూ.388.5 పైసలు పెరిగింది. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో దారుణంగా రూ.1,572.5, రూ.1553.5, రూ.1,553.5 పైసలకు ఎగబాకింది. ఇలా వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగితే దాని ప్రభావాన్ని వ్యాపారులు సామాన్య ప్రజలపై వేస్తారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరల దెబ్బకు విలవిల్లాడుతున్న సామాన్యులు నెలనెల గ్యాస్‌ ధరలు పెంచడంతో కట్టెల పొయ్యే మేలని భావిస్తున్నారు.
ఇలా నెలనెలా ధరలు పెంచుతున్న కేంద్ర చమురు సంస్థలు
మోడీ ప్రభుత్వం 2014 లోక్‌సభ ఎన్నికల ముందు దళిత, బహుజనుల శ్రేయస్సు కోసం పాటుపడతానని ఇచ్చిన వాగ్దానం తుంగలో తొక్కుతున్నదని మండిపడుతున్నారు. ఇప్పటికే నోట్లరద్దు, జీఎస్టీతో పేదల అవసరాలకు ఉపయోగపడే పలు వస్తువులపై అదనపు బాదుడు వేసి కొనుగోలు చేయలేని పరిస్థితి. చమురు కంపెనీలు రోజుకో ధర నిర్ణయిస్తూ వాహనాదారులను అయోమయానికి గురిచేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో నెలనెల గ్యాస్‌ ధర పెంచడం దారుణమని మోడీ సర్కార్‌పై విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు.
నోట్ల రద్దు, జీఎస్టీ తర్వాత పెరిగిన నిత్యావసరాల ధరలు
పెంచిన గ్యాస్‌ ధరలు వెంటనే తగ్గించాలని గృహిణులు కోరుతున్నారు. తాము పనిచేసే చోట గ్యాస్‌ ధరలు పెంచినట్టు జీతాలు పెంచడం లేదని చెప్పారు. ఓ వైపు కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి అందనంత ఎత్తులో ఉన్నాయి. నోట్ల రద్దు, జీఎస్టీ అమలు తరువాత ధరలు తగ్గుతాయని గొప్పలు చెప్పన కేంద్రం.. ప్రస్తుతం అందుకు విరుద్ధంగా జరుగుతున్నా పట్టించుకోవడంలేదు. గతంలో ఏ సర్కార్‌ ఇంత పెంచలేదు. సామాన్యులు వంటగ్యాస్‌ను వదిలేసి కట్టెల పొయ్యిపై వంటచేయాల్సి వస్తుందేమోనని అభిప్రాయపడుతున్నారు. కుటుంబానికి అందించే వంటగ్యాస్‌ సిలిండర్‌పై భారం మోపడం అన్యాయమని అంటున్నారు. సబ్సిడీని పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయం తీసుకోవడం దారుణమని అభిప్రాయ పడుతున్నారు.

Divorce విడాకులు

Divorce విడాకులు
Prabhakargoud Nomula

*ఓ* *హిందువు* *మెలుకో,* *నీ* *కర్తవ్యం తెలుసుకో...*
హిందువులను చైతన్య పరచే ఉద్దేశ్యంతో ఈ సమాచారం చేరవేస్తున్నాం. చదవండి, చదివించండి, చట్టపరిధిలో హిందూ హక్కులకై పోరాడండి. మీకు ఎల్లప్పుడు మా తోడ్పాటు ఉంటుంది.
*1.* నీ భార్య(భర్త)గాని వేరే మతం పుచ్చుకున్నా, లేక కూటములకు, దర్గాలకు వెళ్తున్నా, నువ్వు అతడు(అమె) నుండి విడాకులు పోందవచ్చు.(హిందు వివాహ చట్టం సెక్షన్ 13(1)II.
2. నీ భార్యగాని, తల్లిగాని, కుమార్తెగాని దర్గాలకు, కూటములకు వెళ్లుతున్నారా, వీరికి మనోవర్తి చెల్లించనక్కర్లేదు. సెక్షన్ 18(3) ఆఫ్ ఆక్ట్ 78 ఆఫ్1956.
3. నీ కోడుకుగాని, కోడలు గాని వేరే మతం పుచ్చుకోన్నాక పిల్లల్ని కంటే వారికి తాత ఆస్థిలో గాని, మరి ఏ ఇతర హిందూ బంధువుల నుండి గాని, వారసత్వపు హక్కుగాని , వాటా పంచమని అడిగే హక్కుగాని లేదు.
4. తల్లిదండ్రులు మతం మారినట్లైతే వారు పిల్లలకు, పిల్లల ఆస్తికి గార్డియన్ గా ఉండే హక్కును కోల్పోతారు. (సెక్షన్ 6, హింతూ మైనార్టీ&గార్డియన్ షిప్ చట్టం) అటువంటప్పుడు దగ్గర బంధువులుగాని, చుట్టుపక్కల హిందువులు గాని స్వచ్చందందా ముందుకు వస్తే సంబందిత జిల్లా కోర్టు వారిని ఆ పిల్లలకు సంరక్షకులుగా కోర్టు నియమిస్తుంది. అంతే కాదు మత మార్పడుల కార్యక్రమంపై (బాష్టిజం లేదా ముస్లింమతంపై ) ముందుగా ఎవరైనా కోర్టుకు వస్తే, మైనర్లను మతం మార్చకుండా సివిల్ కోర్టులకు తాత్కాలిక ఇంజక్షన్ ఆఱ్డర్ ఇచ్చే హక్కు ఉంది.
5. మతం పుచ్చుకున్నBc-A,B,D గ్రూపుల వారు Oc గా పరిగణించబడతారు. అదే విధంగా క్రైస్తవమతం పుచ్చుకున్న Scలు, Bc-cలుగాను, ముస్లిం మతం పుచ్చుకున్న Scలు, Ocలు గాను పరిగణింపబడతారు. అలాగై క్రైస్తవ, లేదా ఇస్లాం మతం పుచ్చుకున్న STలు Ocలుగా పరిగణించబడతారు.
6. మతం మార్చుకోని కూడా SC, ST, BC రిజర్వేషన్ సౌకర్యాలు ప్రభుత్వం నుండి పోందుతున్న వాళ్లపై సెక్షన్ 420 IPC ప్రకారం చీటింగ్ కేసులు పెట్టవచ్చు.
7. SC, ST కోటాలో ఉద్యోగం సంపాదించిన తరువాత చర్చికి వెళ్లడం లేదా క్రైస్తవంను నమ్ముకోవడం చేస్తే వారి ప్రమోషన్ వారి పిల్లల సౌకర్యంల నిమిత్తం BC-c మాత్రమే అవుతారు వారు ఇంకా రిజర్వేషన్ సౌకర్యం పోందుతూ వుంటే వారిపై ఎవరైన చీటింగ్ కేసు పెట్టవచ్చు. ఇటువంచి సమాచారం మీ వద్ద ఉంటే ఫిర్యాదు పోలీసువారికి పంపి వాటి ప్రతి మీ దగ్గరలో ఉన్న మా కార్యకర్తలకు సమాచారం ఇవ్వండి.
8. నిజంగా ఆనాధలు లేకపోయినా ఉన్నట్లు ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు చూపించడం జరుగుతూనే ఉంటుంది. అటువంటి మతసంస్థలపై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తూ దగ్గరలో ఉన్న మా కార్యకర్తలకు కాపీ అందజేయండి. వారు సంబంధిత పోలీస్ మరియు రెవెన్యూ అధికారులతో సంప్రదించి వారిపై చట్టప్రకారం తగు చర్య తీసుకునే విధంగా ఏర్పాటు చేస్తారు. ఇటీవల బయటపడిన పీటర్ సుబ్బయ్య, సావిత్రమ్మ మొదలైన మిషనరీల సంస్థల కేసులు గమనించండి.
9. మతం మారిన వాళ్ల SC, ST రిజర్వు స్థానాల్లో ఫోటీ చేయరాదు. వారు BC రిజర్వు స్థానాల్లో ఫోటీ చేయవలసి ఉంటుంది. అలా పోటీ చేస్తే వారిపై చీటింగ్ కేసు పెట్టవచ్చు. ఫిర్యాదు కలెక్టర్ కు, సబ్ ఇన్స్ పెక్టర్ ఆఫ్ పోలీసుకు పంపిస్తూ
స్థానికంగా ఉన్న మా కార్యకర్తలకు తెలియజేయండి.
10. The A.P Prohibition of Cow slaughter and Animal Preservation Act 1977 (AP Act No.11 of 1977) Section 5,6,10,11 Prevention of cruetly to Animal Act 1960, Animals Act 1960. Moter vechile Act Rules 49-50 Transport Act 1978 And 1989 Rule 253, sub Rule(I) clause (III) ప్రకారం గోహత్య, గోవుల తరలింపు చట్ట విరుద్ధం. కావున ఎక్కడైనా గోవుల హత్యలు గాని, గోవుల తరలింపు గాని జరుగుతున్నట్లైతే మా కార్యకర్తల దృష్టికి తీసుకురండి.
11. 1976సం. నుండి మనదేశంలో విదేశీవిరాళముల నియంత్రణ చట్టం (Act 49/1976) అమలులో ఉంది. స్వచ్ఛంద సెవాసంస్థల పేరుతో, ఇతర దేశాల నుండి వస్తున్న డబ్బు మత మార్పిడులకు ఉపయోగించడం ఈ చట్టం ప్రకారం నేరం కాబట్టి అటువంటి సంస్థలపై ఈ చట్టం ప్రకారం జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేయవచ్చు.
12. హిందువుల మధ్యలో చర్చి నిర్మాణం చేయరాదు. చేసిన యెడల దగ్గరలో ఉన్న మా కార్యకర్తలకు తెలియపర్చండి.
13. ఎక్కడైన హిందూ స్ర్తీల పై, విద్యార్థినులపై లవ్ జీహాద్ చేస్తున్న సంఘటనలు ఉన్నట్లైతే మా దృష్టికి తీసుకురండి. లవ్ జీహాద్ అనేది ముస్లిం యువకులు అనుసరిస్తున్న ఫంథా. వారి సంఖ్యను పెంచుకోవటం దీని ఉద్ధేశ్యం. మతం మార్చటం కోసం చేసుకునే పెళ్ళిల్లు చెల్లనేరవని ఇటీవల అలహాబాద్ హై కోర్టు ఇచ్చిన తీర్పును గమనించండి.
14. హిందూ వ్యతిరేకుల వద్ద ఏ విధమైన వ్యాపార లావాదేవీలను జరపకండి.
15. హజ్ యాత్రికులకు కోట్ల రూపాయల ప్రయాణ రాయితీ కల్పిస్తూ, హిందువులు తమ పండుగలకు ఊళ్ళకు వెలుతుంటే రవాణా చార్జీలు పెంచడాన్ని ఖండించండి. హింతూ దేవాలయాలపై ప్రభుత్వం పెత్తనం చేస్తూ, ఆ ఆదాయాన్ని ప్రభుత్వం
మరల్చుకోంటుంది. కాని ఇతర మత సంస్థల ఆదాయా వ్యయాలను ఎందుకు పరిశీలించటం లేదు?
16. రహదారుల పై అడ్డంగా ఉన్న నిరుపయోగంలో ఉన్న ప్రార్థన స్థలాలపై కుహానా సెక్యులర్ వాదుల తీరును ఖండించండి.