17, నవంబర్ 2017, శుక్రవారం

Chiranjeevi చిరంజీవి

Chiranjeevi చిరంజీవి ...

చిరంజీవి- స్వయం క్రుషి: సినీ రంగం లో ప్రవేశించిన 1978 నుంచి 1980 వరకు చిరంజీవి నటించిన సినెమాలు దాదాపు ఎవ్వరికీ తెలియదు. మొదటి 25 సినెమాలు చెప్పమంటే చిరంజీవి నే చెప్పలేడు అంటే అతిశయోక్తి కాదు. 1980 లో తమ కులపోడే కదా అని అల్లు రామలింగయ్య తన కూతురిని ఇచ్చి పెళ్ళి చేశాకే చిరంజీవి కి ఫ్లాట్ ఫార్మ్ దొరికింది, చెప్పుకోటానికి ఒక అడ్రస్ దొరికింది.
భారత చలన చిత్ర రంగం లో అత్యధికం గా ఫుష్ అప్, బ్యాక్ అప్ ఉంది చిరంజీవి ఒక్కడికే. ఒక వైపు పిల్లనిచ్చిన మామ, ఇంకో వైపు బావ మరిది అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్. మరోవైపు ఎంత చెత్త సినెమా లో నటించినా అల్లు అరవింద్ ఆధ్వర్యం లోని అత్యధిక దియోటర్స్. మామూలు చిరంజీవి ని మెగా స్టార్ చిరంజీవి ని చేసింది గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ & అల్లు రామలింగయ్య గారే .
చిరంజీవి కి మొదటి అవార్డ్ తెచ్చి పెట్టిన "శుభలేఖ" కానీ ఆ తర్వాత అవార్డ్ తెచ్చి పెట్టి గుర్తింపు ఇచ్చిన "విజేత" కానీ నిర్మించింది అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ నే.
విజేత సినెమా కి అవార్డ్ రాకముందే చిరంజీవి 80 వరకు సినెమాలు చేశాడు.
దర్శక రత్న దాసరి నారాయణ రావు గారు కూడా తన కుమారుడి చేత రెండు , మూడూ సినెమాలు తీసి గుర్తింపు రాలేదు అని ఆపేశారు. కానీ, చిరంజీవి కి గుర్తింపు తేవటానికి అల్లు రామలింగయ్య, అల్లు అరవింద్ 80 సినెమాల వరకు పుష్ అప్, బ్యాక్ అప్ ఇస్తూనే ఉన్నారు. 1985 లో విజేత సినెమాకి అవార్డ్ వచ్చేంతవరకు చిరంజీవి నటించిన సినెమాలు 80. ఆ తర్వాత 30 సంవత్సరాలలో చిరంజీవి నటించిన సినెమాలు 70.
ఆ తర్వాత కూడా, దియోటర్స్ అన్నీ తమ గుప్పెట్లో ఉన్న ఆ నలుగురు లో ఒకరు అయిన అల్లు అరవింద్ చిరంజీవి సినెమాలకి ఎక్కువ దియోటర్స్ ఇచ్చి బ్యాక్ అప్ ఇస్తూనే ఉన్నారు.
1978 కంటే ముందే లక్షల్లో ఫీజు కట్టి మద్రాస్ ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ లో కోర్స్ చేయగలిగినంత డబ్బు చిరంజీవి ఫాదర్ ఇచ్చాడు.
వరుస ప్లాఫ్ లు వచ్చిన ప్రతిసారీ హిట్ అయిన పరభాషా సినెమా ని తెలుగు లో తీయటం చిరంజీవి కి అలవాటు. మొట్టమొదటి సినెమాల్లో ఒకటైన మనవూరి పాండవులు కూడా రీమేక్ సినిమా నే. ఈ మధ్య థాగూర్ సినెమా ముందు ప్లాఫ్ లతో కొట్టుమిట్టాడుతుంటే ఆల్ రడీ మరో హీరో రాజ శేఖర్ కొన్న సినెమా ని మళ్ళీ ఎక్కువ డబ్బులు ఆశ చూపి మచి పూచి మారేడు కాయ చేసి ఠాగూర్ సినెమాని దక్కించుకొని హిట్ కొట్టాడు అని వార్తల్లో చూశాం. గ్యాప్ తర్వాత వచ్చిన చిరంజీవి మళ్ళీ తమిళం లో హిట్ అయ్యిన కత్తి సినెమా నే తెలుగు లో తీచి నటించాడు.
మొత్తం 25 వరకు వేరే భాషల్లో సూపర్ హిట్ అయిన వాటిని తీసుకొని తెలుగు లో నటించాడు చిరంజీవి.
ఏతా వాతా నేను చెప్పదలచుకున్నది ఒక్కటే. చిరంజీవి వి స్వయం క్రుషి కి సంబందం లేదు. అమితాబ్ బచ్చన్ కూడా అభిషేక్ బచ్చన్ కి కొంతవరకే పుష్ అప్ ఇచ్చాడు. కానీ, చిరంజీవి కి ప్రస్తుతం కూడా అల్లు అరవింద్ ఎక్కువ దియోటర్స్ రూపం లో పుష్ అప్, బ్యాక్ అప్ ఇస్తూనే ఉన్నాడు. 
అన్నీటికంటే ముఖ్యం గా ఆ రోజుల్లో ని రామారావు, నాగేశ్వరావు, క్రిష్ట్న, శోభన్ బాబు, మోహన్ బాబు. ఇంకా, ఆ నలుగురు టాప్ హీరోల్లో బాలక్రిష్న, నాగార్జున, వెంకటేష్ ఒకే సామాజిక వర్గం అవ్వటం వలన మిగతా అన్ని సామాజిక వర్గాల వాళ్ళు చాలా మంది చిరంజీవి కి పుష్ అప్, బ్యాక్ అప్ ఇచ్చి ఆదరించారు. ఆ సామాజిక వర్గం లో పడని వాళ్ళు కూడా చిరంజీవి కి అండ దండలు ఇచ్చి పెద్దోన్ని చేశారు .
ఏది ఏమైనా, స్వయం గా ఎదగని వాళ్ళ పక్కన స్వయం క్రుషి పేరు వాడుతుండటం వలనే స్వయం క్రుషి తో ఎదిగిన ఉదయ కిరణ్ లాంటోళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
ఎవరో మన మెదళ్లలో నింపిన సమాచారం కాకుండా ఉన్నది ఉన్నట్లు చూడగలిగితే నిజాలు మనకే అవగతం అవుతాయి. భావోద్వేగాన్ని పక్కన పెట్టి నిజం గా స్వయం క్రుషి తో ఎదిగిన వారిని రేపటి పౌరులకి పరిచయం చేయండి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి