29, జూన్ 2017, గురువారం

Sarvai papanna warangal సర్వాయి పాపన్న

మా జిల్లా వరంగల్ ఒకప్పటి ఏకశిలా నగరం కాకతీయుల నాటి ఓరుగల్లును ఏలిన గౌడ మహారాజు సర్వాయి పాపన్న చరిత్ర గురించి తెలుగు వికీపీడీయాలో నేను రాశాను. గౌడ మహారాజు సర్వాయి పాపన్న చరిత్ర ...





సర్వాయి పాపన్న నేటి వరంగల్ జిల్లాజనగాం మండలం ఖిలాషాపూర్ గ్రామంలో జన్మించాడు. తండ్రి చిన్న తనం లోనే చనిపోయారు, సర్వమ్మ అతడి తల్లి, పాపడు అని అతన్ని పిలిచేవాడు. పాపన్న ఎల్లమ్మకు పరమ భక్తుడు, అతను శివున్ని ఆరాధించేవాడు. తల్లి కోరిక మేరకు గౌడ వృత్తిని స్వీకరించాడు.
జననం,బాల్యం
ధూల్మిట్ట శాసనం ప్రకారం ఆగష్టు 181650 నాడు పాపయ్య వరంగల్ జిల్లాలో గౌడ్ కులంలో జన్మించాడు.
బాల్యంలో పశువులను కాస్తూ ఆనాటి సాంఘీక, ఆర్థిక, రాజకీయ పరిస్ధితులు గమనించేవాడు, తల్లి సర్వమ్మకు ఒక్కకొడుకు కావడంతో గారాబంగా పెంచింది. పాపన్న వంశం శైవమతస్ధులై (శివభక్తులు) (గౌడు కులం వారు అందరు కూడ) నిత్యం పూజలు సంప్రదాయాలను తరాలుగా వస్తున్న సంప్రదాయా జీవితాన్ని యుక్త వయసు వచ్చే నాటికి క్రమక్రమంగా వెతిరేకించాడు. కల్లుతాగడం, మాంసం తినడం అలవాటు చేసుకున్నాడు.
స్నేహీతులు
ఇతర కులాల వారితో తిరగడం వీరిలో చాకలి సర్వన్న, మంగలి మాసన్న, కుమ్మరి గోవిందు, జక్కుల పెరుమాళ్లు, దూదేకుల పీరు, కొత్వాల్ మీరు సాహేబ్ పాపన్న ప్రదాన అనుచరులు. తల్లి సర్వమ్మ కోరికతో తాటిచెట్లు ఎక్కి (కలాలి) కల్లుగీయడం కులం పని చేయడం స్నేహీతులు, పాపయ్య కల్లుతాగడం లోకం తీరు చుట్టుప్రక్కల జరుగుచున్న విషయాల గురించి చర్చలు గంటల తరబడి మాట్లడుకునేవారు.
హైదారాబాదు నైజాం ఆగడాలు
నైజాం సైనికులు భూమి పన్నుల (రకాలు, శిస్తూ) వసూలు విధానం ప్రజలను చాలా హింసాత్మకంగా, ఇబ్బందులకు గురిచేస్తూ పీడించి రకరకల పేర్లతో శిస్తూలు వసూలు చేసేవారు.
కులాల, మతలా పేర్లతో శిస్తూలు వసూలు చేసేవారు. అలాగే గౌడ కులం వారికి ”తాటిచెట్లకు పన్ను” వేసారు. నైజాం సైనికులు శిస్తూలు వసూలు చేసుకొని వేల్లేదారిలో పాపన్న కల్లు అమ్ముకొనే మండువాలో నైజాం సైనికులు కల్లు తాగి డబ్బులు ఇవ్వకుండ అడిగినా ఇవ్వకుండా హేలనగా నవ్వు కుంటు వెళ్లారు. కల్లు తాగి డబ్బులు ఇవ్వకుండ వెల్లడం అలా రెండు, మూడు సార్లు అలాగే జరిగింది.
మొదటి తిరుగుబాటు
నైజాం సైనికులు శిస్తూలు వసూలు చేసుకొని కల్లు తాగి డబ్బులు ఇవ్వకున్న పాపన్న పెద్దగా పట్టించుకునే వాడు కాదు, నైజాం సైనికులు నా వద్ద కల్లు తాగుచున్నారు రాజు గారి సైనికులు అంటే చాల గౌరవనీయులు.అయీనా సైనికులు శిస్తూలు రాజుగారికి లెక్కెలు అప్పగించాలి కదా కల్లుకు డబ్బులు ఇచ్చిన లెక్కె తగ్గును కద పొనిలే అనుకునేవాడు. ఒకరోజు సైనికులు పాపన్న వద్ద కల్లు తాగి వెళ్లిపోవుటకు సిద్దం అవుచుండగా కల్లు మండువాకు వస్తున పాపన్న స్నేహితుడు ఒకరు ”దనరాసులు ఉన్న కల్లు తాగి డబ్బులు ఇవ్వలేని నిరుపేద నైజాం సైనికులు వెళ్లిపోవుటకు సిద్దం అయ్యారా” అని సరసంగా అన్నడు.
అందుకు నైజాం సైనికుల్లో ఒకడు పాపన్న స్నేహితున్ని తన్నుటకు కాలుఎత్తాడు. అదిచూసిన ఒక సెకండులో కోపోద్రిక్కుత్తుడైన పాపన్న తన వద్ద కల్లు గీయడానికి ఉపయొగించు గీత కత్తి, మారు కత్తిలో ఒకదాన్నితో ప్రాణ స్నేహితున్ని తన్నుటకు కాలుఎత్తిన సైనికున్ని మెడ నరికాడు, దాంతో మిగాతా సైనికులు పాపన్న మీదికి యుద్దనికి రావడం ఏంతో బలవంతుడైన పాపన్న వారిని కూడా అంతమొందిచాడు. ఇక అక్కడ మిగిలింది పాపన్న ప్రాణ స్నేహితులు, సైనికుల గుర్రాలు, వసూలు చేసుకొ రాజుగారి దనరాసులు పేదవారిని పీడీంచి వసూలు చేసిన డబ్బులు వారికే ఉపయోగపడాలి అంటు పాపన్న స్నేహితులతో గుర్రాలతో, డబ్బులతో ఇంటికి చేరాడు. అప్పటి నుండి నైజాం సైనికులు శిస్తూలు వసూలు చేసుకొని వేల్లేదారిల్లో పాపన్న, అతని స్నేహీతులతో కలసి తిరుగుబాట్లు ప్రారంబించారు.అలా మొదలైన తిరుగుబాటుతో ఆయుధాలు, గుర్రాలు, డబ్బులు కూడా సమక్చూకున్నాడు. యుద్దవిద్యలు నేర్చుకున్నాడు పేదవారికి డబ్బులు సహాయం చేయడంతో పాపన్న పేరు జనగాం ఏరియాలో మారుమొగింది గ్రామాల్లోని యువకులు పాపన్న వద్ద సైనికులుగా చేరారు.వారికి యుద్దవిద్యలు నేర్పించి, అతి తొందరలోనే 3౦౦౦ మందిని సొంతంగా సైనికులగా సమక్చూకున్నాడు.
భువనగిరి కోటపై తిరుగుబాటు
తెలంగాణాలో నైజాం రాజు యొక్క అప్పటి పాలకుల, అంతకంతకు పెరుగుతున్న ముస్లింల ఆధిపత్యాన్ని అంతం చెయ్యాలని, తాబేదారులు, జమీనుదారులు, జాగీర్దారులు, దొరలు, భూస్వాములు చేసే దురాగతాలను గమనించి గోల్కొండ కోటపై బడుగువారి జెండాను ఎగురవేయాలని నిర్ణయించి ఆ దిశగా ప్రస్థానం ప్రారంభించాడు. అయితే పాపన్నకు ఎలాంటి వారసత్వ నాయకత్వం కాని, ధనంకాని, అధికారం కాని లేవు. గెరిల్ల సైన్యాన్ని తయారు చేసి, ఆ సైన్యం ద్వారా మొగలు సైన్యం పై దాడి చేసి, తన సొంత ఊరు ఖిలాషాపూర్ ని రాజధానిగా చేసుకొని, 1675 లో సర్వాయి పేటలో తన రాజ్యాన్ని స్థాపించాడు.
పాపన్న ఛత్రపతి శివాజీకి సమకాలికుడు. శివాజీ ముస్లింల పాలనా అంతానికి మహారాష్ట్రలో ఎలాగైతే పోరాడాడో, పాపన్న కూడా తెలంగాణాలో ముస్లింల పాలనా అంతానికి పోరాడారు. 1687 - 1724 వరకు అప్పటి మొగల్ చక్రవర్తి ఔరంగజేబు సైన్యానికి వ్యతిరేకంగా పోరాడాడు. పాపన్న ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమించి విజయ దుర్గాలు నిర్మించాడు. 1678 వరకు తాటికొండ, వేములకొండ లను తన ఆధీనం లోకి తెచ్చుకొని దుర్గాలను నిర్మించాడు.
ఒక సామాన్యవ్యక్తి శతృదుర్భేద్యమైన కోటలను వశపర్చుకోవడం అతని వ్యూహానికి నిదర్శనం. సర్వాయిపేట కోటతో మొదలుపెట్టి దాదాపు 20 కోటలను తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. అతని ఆలోచనలకు బెంబేలెత్తిన భూస్వాములు, మొగలాయి తొత్తులైన నిజాములు కుట్రలు పన్ని సైన్యాన్ని బలహీనపర్చారు. 1700 - 1705 మధ్యకాలంలో షా పురలో మరొక దుర్గం నిర్మించాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ దాదాపు 12 వేల సైనికులను సమకూర్చుకొని ఎన్నో కోటలను జయించి చివరకు గోల్కొండకోటను స్వాధీనపర్చుకొని 7 నెలలపాటు అధికారం చెలాయించాడు. తెలంగాణలో మొగలాయి విస్తరణను తొలిసారిగా అడ్డుకున్నది సర్వాయి పాపన్నే. అతని సామ్రాజ్యం తాటికొండకొలనుపాకచేర్యాల నుండి కరీంనగర్ జిల్లా లోని హుస్నాబాద్హుజూరాబాద్ వరకు విస్తరించింది. భువనగిరి కోటను రాజధానిగా చేసుకొని అతను ముప్పై సంవత్సరాలు పరిపాలించాడు.
పాపన్నఒక సాధారణ గౌడ కుటుంబం నుండి వచ్చిన వాడు కనుక అతనికి ప్రజల కష్ట నష్టలన్నీ తెలుసు. అందుకే పాపన్న రాజ్యంలో పన్నులు లేవు. ఖజానా కొరకు అతను జమిందార్, సుబేదార్ లపై తన గెరిల్ల సైన్యంతో దాడి చేయించేవాడు. పాపన్న అనేక ప్రజామోద యోగ్యమైన పనులు చేసాడు. అతని రాజ్యంలో సామజిక న్యాయం పాటించేవాడు. తాటి కొండలో చెక్ డాం నిర్మించాడు. అతను ఎల్లమ్మకు పరమ భక్తుడు కావున హుజురా బాద్ లో ఎల్లమ్మ గుడి కట్టించాడు. అది నేటికి రూపం మారిన అలానే ఉంది.ఇతర వివరాలు
పాపన్న గెరిల్ల సైన్యంతో మొగల్ సైన్యం పై దాడి చేస్తున్నాడని ఔరంగజేబుకు తెలిసింది. అతడు రుస్తుం దిల్ ఖాన్ కు బాధ్యతలు అప్పగించాడు. రుస్తుం దిల్ ఖాన్ యుద్ధానికి ఖాసింఖాన్ ను పంపించాడు. షాపుర వద్ద ఇరు సైన్యాలు తలపడ్డాయి. నెలలపాటు యుద్ధం జరిగింది. చివరికి రుస్తుం దిల్ ఖాన్ రంగం లోకి దిగాడు. సుమారు 3 నెలలపాటు యుద్ధం జరిగింది. పాపన్న తన ప్రాణ స్నేహితున్ని కోల్పోయాడు. దాంతో ఆయన యుద్ధాన్ని విరమించుకొని, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. మొగల్ సైన్యాలు అతని కోసం వెతకడం ప్రారంభించాయి. అయితే పాపన్న తన సొంత ఊరు జనగామకు వెళ్లి అక్కడ గౌడ కులం వారు ఎక్కువగా ఉండే చోట జీవితం గడిపాడు. ఔరంగజేబు మరణించిన తర్వాత దక్కన్ పాలకుడు కంబక్ష్ ఖాన్ బలహీన పాలనను చుసిన పాపన్న 1708 ఏప్రిల్ 1 లో వరంగల్ కోటపై దాడి చేసాడు. అయితే ఈ దాడిలో పాపన్న పట్టుబడ్డాడు. 1708 లో గోల్కొండకు తీసుకెళ్ళి పాపన్న తల తీసి కోట ముఖ ద్వారానికి వేళ్ళాడ దీసారు.
మా జిల్లా వరంగల్ ఒకప్పటి ఏకశిలా నగరం కాకతీయుల నాటి ఓరుగల్లును ఏలిన గౌడ మహారాజు సర్వాయి పాపన్న చరిత్ర గురించి తెలుగు వికీపీడీయాలో నేను రాశాను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి